Breaking News

ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు


Published on: 30 Jun 2025 17:33  IST

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దుల్లోకి 8 కోట్ల 20 లక్షల రూపాయిలు సొమ్మును బాలాజీ తీసుకొచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు సిట్ బృందం వెంటాడుతుందనే భయంతో వీరిద్దరూ ఇండోర్ పారిపోయారు. అయితే ఇండోర్ నుంచి ఏపీలో వైసీపీ నేతలకు ఫోన్ చేస్తుండడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇద్దరిని సిట్ బృందం ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి