Breaking News

అమ్మయ్య.. నిమిషా ఉరిశిక్ష వాయిదా..


Published on: 15 Jul 2025 12:54  IST

యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది. జులై 16 (బుధవారం) ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకు యెమెన్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. చివరి క్షణంలో కూడా ఉరిశిక్షను ఆపాలని కేంద్రం యెమెన్‌ ప్రభుత్వాన్ని కోరింది. బాధితుడి కుటుంబానికి 11 కోట్ల బ్లడ్‌ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. చివరిక్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి