Breaking News

విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..


Published on: 15 Jul 2025 14:05  IST

విజయనగరం జిల్లా బొబ్బిలి ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ విద్యార్థి మృతికి దారి తీసింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మధ్య ఏర్పడుతున్న చిన్న చిన్న వాగ్వాదాలు చివరికి భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం దృష్టి పెట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు తలెత్తుతాయని అంటున్నారు మానసిక వైద్యులు.

Follow us on , &

ఇవీ చదవండి