Breaking News

చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్‌ కార్డులు..


Published on: 16 Jul 2025 14:11  IST

దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువ.2025 జూన్ నాటికి భారతదేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు. 2024 డిసెంబర్ 31 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ర్లు డీయాక్టివేట్ చేసినట్లు ఉడాయ్‌ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి