Breaking News

వరుస వివాదాల్లో రిలయన్స్ అధినేత..


Published on: 05 Sep 2025 12:20  IST

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ తోపాటు ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీపై ‘ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ దర్యాప్తునకు సిద్ధమైంది. ఆగస్టు 21వ తేదీన సీబీఐని ముంబై ఎస్‌బీఐ బ్యాంకు ఆశ్రయించింది. ముంబైకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్, దాని డైరెక్టర్ అనిల్ అంబానీ తప్పుడు అకౌంట్స్ చూపించి, మోసపూరితంగా రూ.2,219 కోట్లు లోన్ పొందినట్లు ఫిర్యాదు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి