Breaking News

మహా నిమజ్జనానికి జిహెచ్ఎంసి భారీ ఏర్పాట్లు


Published on: 04 Sep 2025 18:53  IST

వినాయక నిమజ్జన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో విగ్రహాల నిమజ్జనం సజావుగా సాగేందుకు క్రేన్లు, లైటింగ్, మొబైల్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు సిద్ధంగా ఉంచగా, నగర వ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల వద్ద మాత్రమే విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి