Breaking News

సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌


Published on: 27 Oct 2025 15:14  IST

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్‌ చేశారు. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. అనంతరం ఆర్టీజీఎస్‌లో మంత్రులు లోకేశ్‌, అనిత, సీఎస్‌ విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు సీఎం సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి