Breaking News

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం..


Published on: 27 Oct 2025 19:03  IST

మొంథా తుపాన్ తో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి బయలుదేరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.మొత్తంగా 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. అయితే అక్టోబర్ 27వ తేదీన ముందుగా రద్దు అని ప్రకటించిన రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి