Breaking News

అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్‌ రూమ్‌లు


Published on: 27 Oct 2025 15:18  IST

మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్లతో ఏపీ మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలి. తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి అని మంత్రి దిశానిర్దేశం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి