Breaking News

‘మొంథా’ తుపాను ఎఫెక్ట్‌.. 43 రైళ్లు రద్దు


Published on: 27 Oct 2025 15:44  IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపానుగా మారడంతో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, రద్దుచేసిన రైళ్ల జాబితాను ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి