Breaking News

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు...


Published on: 27 Oct 2025 16:23  IST

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని తెలిపారు. మొంథా తుపాను కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల పరిధిలో కేంద్రీకృతం అయిందని చెప్పుకొచ్చారు. రేపు(మంగళవారం) ఈ తుపాను ఉత్తర వాయువ్య దిశలో కదిలి తీవ్ర తుపానుగా మారనుందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి