Breaking News

ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్


Published on: 27 Oct 2025 16:44  IST

కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు సమస్యలతో సతమతమవుతూ మరింత దిగజారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సోమవారం ఆటోలో ఆయన ప్రయాణించారు. తెలంగాణ భవన్ కి చేరుకొని ఆ తర్వాత అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి