Breaking News

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..పలు చోట్ల కూలిన చెట్లు


Published on: 28 Oct 2025 14:57  IST

ఏపీలో ‘మొంథా’ తుపాను ప్రభావం తీవ్రంగా పెరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, పలు ప్రాంతాల్లో చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. నదులు, చెరువులు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరింది. కొన్ని గ్రామాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. విద్యుత్‌ సరఫరా అంతరాయం ఏర్పడగా, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి