Breaking News

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. తిరుమలలో ముసురు


Published on: 28 Oct 2025 17:24  IST

మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది. సాయంత్రానికి చలి తీవ్రత పెరిగింది. తుఫాన్‌ ప్రకటనల నేపథ్యంలో రద్దీ కూడా తక్కువగానే ఉంది. పదిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల ఘాట్‌రోడ్లపై ఫారెస్ట్‌, ఇంజినీరింగ్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.

Follow us on , &

ఇవీ చదవండి