Breaking News

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ బస్సులు..


Published on: 10 Dec 2025 18:26  IST

నగరంలోని రాణిగంజ్‌ బస్‌ డిపోలో 65 ఎలక్ట్రిక్‌ బస్సులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేటలో బస్సులు నడుస్తున్నాయన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి