Breaking News

ఏకపక్ష నిర్ణయం


Published on: 10 Dec 2025 18:28  IST

బడంగ్‌పేట్‌ సర్కిల్‌ను ఎల్బీనగర్‌ జోన్‌లో కలుపాలని రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుంది. అన్ని పార్టీల నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి ఆందోళన కార్య క్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. బస్తీల్లో సంతకాల సేకరణ చేపడుతున్నారు. ప్రజల మద్దతును కూడగడుతూ కాలనీల్లో పర్యటిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిష నర్‌ కర్ణన్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బడంగ్‌పేట్‌ను చార్మినార్‌లో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి