Breaking News

సిసలైన విశ్వాస ఘాతకుడు మోదీ..


Published on: 10 Dec 2025 19:00  IST

ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడైతే, సిసలైన విశ్వాస ఘాతకుడు నరేంద్ర మోదీ అని విమర్శించారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని,దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లే అని పేర్కొన్నారు.లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొడుతునట్లే అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా మత విద్వేషా లను రెచ్చగొట్టినట్లే అని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి