Breaking News

బస్సు కండక్టర్‌పై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి


Published on: 16 May 2025 12:32  IST

గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు 20 మందికి పైగా అనుచరులతో కలిసి మదనపల్లెలో కండక్టర్‌పై దాడికి పాల్పడ్డారు మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా. తన బస్సుకంటే ముందుగా ఎందుకు వస్తున్నారంటూ.. కొట్టారని బాధితుడు ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవాజ్‌బాషాతో మాట్లాడారు. బాధితుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాజ్‌బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి