Breaking News

మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్..


Published on: 25 Jun 2025 15:44  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జులై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ తొలుత పూర్తైన పరీక్షల ఆన్సర్‌ కీలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. తాజాగా జూన్‌ 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, జూన్‌ 17న జరిగిన జంతుశాస్త్రం పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి