Breaking News

రూ.28.97లక్షల విలువైన మద్యం ధ్వంసం


Published on: 04 Apr 2025 15:48  IST

అమరావతి: కృష్ణా జిల్లాలో రూ.28.97లక్షల విలువ చేసే మద్యాన్ని జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. 2013 ఏప్రిల్‌ నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించగా వివిధ కేసుల్లో 15,280 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ తాజాగా ఎస్పీ గంగాధరరావు పర్యవేక్షణలో పోలీసులు రోడ్‌ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. 684 లీటర్ల నాటుసారాను పారబోశారు.

Follow us on , &

ఇవీ చదవండి