Breaking News

టీమిండియాలోకి వైభవ్ నోఎంట్రీ..


Published on: 11 Jul 2025 15:09  IST

భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే క్రికెట్‌లో పేలుడు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఆతిథ్య ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన ఈ సిరీస్‌లో వైభవ్ 5 మ్యాచ్‌ల్లో 355 పరుగులు చేశాడు. ఇందులో 29 సిక్సర్లు, 30 ఫోర్లు ఉన్నాయి. ఇంతటి పేలుడు బ్యాటింగ్ చేసినప్పటికీ, వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కడం కష్టమే. ఐసీసీ నిబంధనల ప్రకారం, జాతీయ జట్టుకు ఆడే ఆటగాడికి కనీసం 15 సంవత్సరాలు నిండాలి.

Follow us on , &

ఇవీ చదవండి