Breaking News

ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు


Published on: 22 Jul 2025 16:23  IST

మధిర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి పనులను నెల రోజుల్లోపే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి జిల్లా ఉన్నతాధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని వహిస్తే సహించమని స్పష్టం చేశారు. వైరా - మధిర ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎస్టి ఎస్ డి ఎఫ్ నిధులు 12 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. గత 18 నెలల క్రితం ప్రారంభించిన ఈ రోడ్డు పనులు నేటి వరకు పూర్తికాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి