Breaking News

స్విగ్గీ, జొమాటో యూజర్లకు షాక్..


Published on: 16 Sep 2025 11:41  IST

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారిపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది. డెలివరీ ఛార్జీలపై ప్రభుత్వం కొత్తగా 18 శాతం జీఎస్టీ విధించడమే ఇందుకు కారణం. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారుల జేబుపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది

Follow us on , &

ఇవీ చదవండి