Breaking News

సైనికుల్లా వచ్చి బ్యాంకును దోచుకున్న దొంగల ముఠా


Published on: 17 Sep 2025 12:45  IST

కర్ణాటక లో దొంగలు బీభత్సం సృష్టించారు. విజయపుర జిల్లా చడచన్‌ పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ లో పట్టపగలే దొంగల ముఠా దోపిడీకి పాల్పడింది. సైనిక దుస్తుల్లో ముసుగులు ధరించిన ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ప్రవేశించారు. దేశీయ పిస్టోళ్లు, పదునైన ఆయుధాలతో బ్యాంక్‌లోకి ప్రవేశించిన ముఠా.. బ్యాంకు మేనేజర్‌, క్యాషియర్‌, ఇతర సిబ్బందిని ఓ చోట బంధించింది. అనంతరం బంగారు ఆభరణాలు, కొంత మొత్తంలో నగదు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి