Breaking News

సునీతకు బీ ఫామ్‌ అందజేసిన బీఆర్ఎస్‌ అధినేత


Published on: 14 Oct 2025 18:12  IST

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా బరిలో దిగిన మాగంటి సునీతా గోపీనాథ్‌ కు పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. అదేవిధంగా ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును కూడా అందించారు.ఈ సందర్భంగా మాగంటి సునీతా గోపినాథ్‌ వెంట ఆమె కూతుళ్లు, కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితరలు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి