Breaking News

ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం


Published on: 19 Oct 2025 14:03  IST

దీపావళి వేళ.. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది. హస్తినలో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. వికాస్‌పురి ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 238, అక్షర్‌ధామ్ ప్రాంతంలో 426గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. ఈ సీజన్‌లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి