Breaking News

ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ..


Published on: 22 Oct 2025 16:08  IST

సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ప్రకారం.. దీపావళి అనంతరం రెండు రోజుల తర్వాత బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితికి చేరింది. ఏకంగా ఏక్యూఐ లెవెల్స్‌ 345గా నమోదయ్యాయి. ఉదయం 6:15 గంటల సమయంలో అశోక్‌ విహార్‌, బవానా, దిల్షాద్‌ గార్డెన్‌ ప్రాంతాల్లో ఏక్యూఐ 380గా నమోదైంది. డీటీయూ, ఎయిర్‌పోర్ట్‌, లోధి రోడ్డు సహా ఇతర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగానే నమోదైంది. మరోవైపు రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.

Follow us on , &

ఇవీ చదవండి