Breaking News

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది..


Published on: 24 Oct 2025 12:03  IST

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి