Breaking News

నేడు పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం


Published on: 19 Nov 2025 12:30  IST

కాటన్‌, జిన్నింగ్‌ మిల్లర్లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. పలు డిమాండ్లతో పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన జిన్నింగ్‌ మిల్లర్లు... బుధవారం కొనుగోళ్లను పునఃప్రారంభించేందుకు అంగీకరించారు. సచివాలయంలో సీసీఐ సీఎండీ లలిత్‌ కుమార్‌ గుప్తా, జిన్నింగ్‌ మిల్లర్ల అసోషియేషన్‌ ప్రతినిధులతో మంత్రి తుమ్మల మావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో జన్నింగ్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్‌ ప్రతినిధులు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి