Breaking News

ధర్మేంద్ర మృతి.. ప్రముఖుల సంతాపం..


Published on: 24 Nov 2025 16:29  IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఆయన తన నటన ద్వారా గెలుచుకున్నారన్నారు. భారతీయ సినిమాకు ధర్మేంద్ర చేసిన సేవలు.. తరతరాలు మరిచిపోలేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని  ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి