Breaking News

అర్ధరాత్రి సీపీ సజ్జనార్‌ ఆకస్మిక తనిఖీలు..


Published on: 24 Nov 2025 19:03  IST

హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్‌ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు లంగర్‌హౌస్‌, టోలిచౌకి ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రౌడీషీటర్ల ఇండ్లకు నేరుగా వెళ్లారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, ప్రస్తుత జీవనంపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి విడిచిపెట్టాలని హెచ్చరించారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి