Breaking News

ప్లాన్‌ ప్రకారమే బీసీలను కాంగ్రెస్‌ మోసం చేస్తోంది..


Published on: 24 Nov 2025 19:07  IST

బీసీలకు అన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ అంటే రాజకీయాల్లో కేవలం 42 శాతం రిజర్వేషన్లే కాదని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల బిల్లులు పాస్‌ చేసి ఇంకా జీవో ఇవ్వలేదని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి