Breaking News

ధర్మవరం కుర్రాడు అదుర్స్‌ బాబోయ్...


Published on: 26 Nov 2025 11:58  IST

ధర్మవరానికి చెందిన సహృద్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో సత్తాచాటాడు. ఏకంగా టైటిల్‌నే కైవసం చేసుకున్నాడు. ఫణికుమార్‌, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీలో 800 మందికిపైగా క్రీడాకారులు పోటీపడ్డా రు. అందులో సహృద్‌ 1800బి రేటింగ్‌ విభాగంలో 9 రౌండ్లకుగాను ఎనిమిదింటిలో గెలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి