Breaking News

శాలిబండ అగ్నిప్రమాదం..షాపు యజమాని మృతి


Published on: 26 Nov 2025 12:05  IST

పాతబస్తీ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్నిప్రమాద ఘటనలో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందాడు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శివకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. షాపు యజమాని మృతితో గోమతి ఎలక్ట్రానిక్స్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి