Breaking News

ఐపీఎల్ వేలానికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరం


Published on: 02 Dec 2025 14:29  IST

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కోసం జ‌రిగే ఆట‌గాళ్ల వేలానికి ఆస్ట్రేలియా క్రికెట‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరం అయ్యారు. క్రికెట‌ర్ల వేలానికి అందుబాటులో ఉండ‌డం లేద‌ని ఆసీస్ బ్యాట‌ర్ ఇవాళ ప్ర‌క‌టించాడు. డిసెంబ‌ర్ 16వ తేదీన అబుదాబిలో ఐపీఎల్ ప్లేయ‌ర్ల వేలం జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఐపీఎల్‌లో అత‌ను 2012 సీజ‌న్ నుంచి ఆడుతున్నాడు. హిట్ట‌ర్‌గా పేరుగాంచిన మ్యాక్స్‌వెల్ 2019 సీజ‌న్‌లో మాత్రం ఆడ‌లేదు. ఇక అత‌ను 141 మ్యాచుల్లో కేవ‌లం 2819 ర‌న్స్ మాత్ర‌మే చేవాడు.

Follow us on , &

ఇవీ చదవండి