Breaking News

జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..ఆయనకు ఐదేళ్లు పట్టింది


Published on: 02 Dec 2025 17:36  IST

పింఛన్‌ సొమ్ము రూ.వెయ్యి పెంచేందుకు జగన్‌కు ఐదేళ్ల పట్టిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ విమర్శించారు. రాజీవ్‌ కాలనీ పంచాయతీలోని మరాఠీకాలనీ, 16వ డివిజన్‌లోని బాబానగర్‌, 38వ డివిజన్‌లోని కోవూరు నగర్‌లో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ... జగన్‌ ప్రభుత్వంలో రారష్ర్టానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదని, ఆఖరికి విశాఖపట్నంలో ప్రభుత్వ ఆఫీసులను తాకట్టు పెట్టారని, ఆయన మరోసారి సీఎం అయి ఉంటే రాష్ర్టాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేవారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి