Breaking News

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి


Published on: 03 Dec 2025 18:43  IST

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్‌ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. ఈ నెల 7న యూనివర్సిటీలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఇరవై ఏండ్లుగా వర్సిటీలో 1117 మంది ఉద్యోగులు చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నామన్నారు. మాకు ఎలాంటి భద్రత, బెనిఫిట్స్‌ లేకుండా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి రెగ్యులైజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి