Breaking News

బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తామన్న


Published on: 04 Dec 2025 16:11  IST

బెంగాల్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదానికి తెరతీసిన తృణమూల్ నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఎమ్‌సీ ప్రకటించింది. బీజేపీ మద్దతుతో ఆయన మతసామరస్యం దెబ్బతినే వ్యాఖ్యలు చేశారని టీఎమ్‌సీ నేత, కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ మండిపడ్డాడు. గతంలోనే పార్టీ ఆయనను పలుమార్లు హెచ్చరించిందని గుర్తు చేశారు.ఇప్పటికే ఆయనకు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాము. కానీ ఆయన పద్ధతి మార్చుకోలేదు.

Follow us on , &

ఇవీ చదవండి