Breaking News

శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం


Published on: 05 Dec 2025 12:49  IST

దత్త జయం తి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం అందింది. బెంగళూరుకు చెందిన చక్కా వెంకట రాజేశ్వర్‌ పిఠాపురం మహారాజా కోట ప్రాంతంలో 940 చదరపు గజాల విస్తీర్ణంలో భవంతి నిర్మించారు. రూ.2 కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని శ్రీపాదశ్రీవల్లభులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అంగీకార పత్రాలను దత్త జయంతి రోజైన గురువారం మహా సంస్థానం ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్‌.సౌజన్యకు అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి