Breaking News

పల్నాడు రోడ్డు ప్రమాదంలో వీడిన మిస్టరీ..


Published on: 08 Dec 2025 12:20  IST

జిల్లాలోని చిలకలూరిపేట వద్ద మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌‌కు కారును అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం జరిగిందని... కారును అడ్డంపెట్టడం వల్లే కంటైనర్‌ను వెనుక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి