Breaking News

కూకట్‌పల్లి అభివృద్ధిపై కవిత షాకింగ్ కామెంట్స్


Published on: 08 Dec 2025 15:11  IST

హైదరాబాద్‌‌కు కూకట్‌పల్లి కామధేనువుగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమవారం కూకట్‌పల్లిలో పర్యటించిన కవిత... వై జంక్షన్‌ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కూకట్‌పల్లి  నియోజకవర్గంలో తమ పర్యటన సాగుతోందన్నారు. ఇక్కడ 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మిందని..కానీ కూకట్‌పల్లి నియోజకవర్గం కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి