Breaking News

సీఎంకు హాయ్ అంటూ రోబో పలకరింపు


Published on: 08 Dec 2025 16:32  IST

భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను అందరికీ వివరిస్తోంది రోబో. ఇక గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబో హాయ్ అంటూ పలకరించింది. తిరిగి ముఖ్యమంత్రి కూడా రోబోకు హాయ్ చెబుతూ ముందుకు సాగారు.

Follow us on , &

ఇవీ చదవండి