Breaking News

ఇసుక స్కాం కేసు.. సుప్రీంలో కీలక పరిణామం


Published on: 08 Dec 2025 16:54  IST

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్జీటీ  విధించిన రూ.18 కోట్ల జరిమానాపై జేపీ వెంచర్స్ ఈరోజు (సోమవారం) సుప్రీంలో ఐఏ దాఖలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ  వాదనలు వినిపించింది. ఈసీలు ప్రభుత్వమే తీసుకుందని, తాము తవ్వకాలు మాత్రమే చేపట్టినందున జరిమానా ప్రభుత్వమే చెల్లించాలని జేపీ వెంచర్స్ సుప్రీంకు తెలియజేసింది.

Follow us on , &

ఇవీ చదవండి