Breaking News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్..


Published on: 08 Dec 2025 17:36  IST

జూనీయర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్ లేకుండా కొన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ కామర్స్ సంస్థలు తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోటోలను అనధికారింకగా ఉపయోగిస్తున్నా రని.. తద్వారా తన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి