Breaking News

పునరావృతమైతే కఠిన చర్యలు


Published on: 09 Dec 2025 11:58  IST

కడప రిమ్స్‌లో క్యాథ్‌ల్యాబ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడిన అప్పటి మెడికల్‌ సూపరింటెండెంట్‌, డీఆర్‌వోలపై అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ.. చైర్మన్‌ పితాని సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైంది. కమిటీ ముందు హాజరుకావాలని నోటీసు ఇచ్చినా పట్టించుకోకుండా గత విచారణకు ఇద్దరూ గైర్హాజరవడంపై మండిపడింది. ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి