Breaking News

పల్లెల్లో ఆత్మీయ పలకరింపులు.. జోరుగా విందులు


Published on: 09 Dec 2025 12:09  IST

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందులు జోరందు కున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి అన్నా నమస్తే.. బాబాయ్ నమస్తే.. అంటూ గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రామానికి వస్తే రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన వారిని సాయంత్రం కలిసి తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి