Breaking News

హైదరాబాద్‏లో.. మరో ఈవెంట్‌ గ్రౌండ్‌


Published on: 09 Dec 2025 14:46  IST

నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్‌ తీరాన ఉన్న పీపుల్స్‌ ప్లాజా మైదానం ప్రఖ్యాతిగాంచింది. దానికి అతి సమీపంలోనే హైటెక్‌ హంగులతో మరో ఈవెంట్‌ మైదానం సిద్ధమవుతోంది. ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు, ఫిట్‌నెస్‌ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేస్తున్నది. ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌కు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహానికి మధ్యన ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నది. ఇప్పటికే ఇక్కడ సీసీ పనులు పూర్తవగా వర్షపు నీరు నిలువకుండా పైప్‌లైన్‌ వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి