Breaking News

చెప్పులతో కొట్టిన తోటి లాయర్లు..!


Published on: 09 Dec 2025 16:02  IST

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై షూ విసిరిన న్యాయవాది రాకేష్ కిషోర్‌కు ఘోర పరాభవం జరిగింది. ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయవాదులు చెప్పులతో కొట్టారు. ఇటీవల మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై షూ విసిరి గొడవకు కారణమైన న్యాయవాది రాకేష్ కిషోర్ ను బి.ఆర్. గవాయ్ క్షమించారు. అయితే, కొంతమంది న్యాయవాదులు మాత్రం కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే కోర్టు కాంప్లెక్స్ లో ఆయనను చెప్పులతో కొట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి