Breaking News

అనిల్‌ అంబానీ తనయుడు పై సీబీఐ కేసు


Published on: 09 Dec 2025 17:23  IST

వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ కుమారుడు జై అన్మోల్‌ అనిల్‌ అంబానీపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. యూనియన్‌ బ్యాంక్‌కు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేసిన వ్యవహారంలో ఈ కేసు పెట్టింది. యూనియన్‌ బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టింది. రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న జై అన్మోల్‌ అంబానీతో పాటు రవీంద్ర శరద్‌ సుధాకర్‌పైనా కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి