Breaking News

సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ..


Published on: 19 Dec 2025 15:18  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో (CR Patil) చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.ఏపీకి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి